మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు (ఎస్వైజి)తో తన కెరీర్ను న్యూ హిట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, బ్లాక్బస్టర్ హనుమాన్ భారీ విజయం తర్వాత ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 120 షూటింగ్ రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దాదాపు 75 శాతం షూట్ పూర్తయింది. ప్రస్తుతం టీం మూడు భారీ సెట్లను నిర్మిస్తోంది. ఇవి నెక్స్ షూటింగ్ షెడ్యూల్కు కీలకమైన బ్యాక్డ్రాప్స్గా వుంటాయి. ఈ సెట్స్లో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
యాక్షన్ సీన్స్ కోసం భారీ సెట్స్
- Advertisement -
- Advertisement -
- Advertisement -