- Advertisement -
న్యూయార్క్లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ 2025 ఈవెంట్లో సామ్సంగ్ మూడు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది . గెలాక్సీ జెడ్ ఫోల్ 7, జెడ్ ఫ్లిప్ 7, తక్కువ ధరలో అందుబాటులో ఉండే జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఇలను ఆవిష్కరించింది. జెడ్ ఫోల్ 7, సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాకంటే తక్కువ బరువు కలిగి ఉండటంతో పాటు కొత్తగా 8 -ఇంచ్ మెయిన్ డిస్ప్లేను అందిస్తుంది. ఫ్లిప్ 7లో పెద్ద కవర్ స్క్రీన్, మెరుగైన కెమెరాలు ఉన్నాయి. అత్యంత ప్రీమియంగా ఉండే ఫోల్డబుల్స్ను సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని సామ్సంగ్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఫ్లిప్ 7 ఎఫ్ఇను బడ్జెట్ ధరలో విడుదల చేసింది.
- Advertisement -