- Advertisement -
వరంగల్: కన్నతల్లిపై కసాయి కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించాండు. ఈ సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో జరిగింది. ఆస్తి పంపకాల విషయంలో కుమారుడు సతీష్ గత కొంతకాలంగా తల్లి వినోదతో గొడవపడుతున్నాడు. తల్లి, కుమారుడు మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో తల్లిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. వెంటనే స్థానికులు గాయపడిన తల్లిని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. తల్లి వినోద పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కుమారుడు సతీష్ పరారీలో ఉన్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -