Wednesday, September 3, 2025

నవంబర్‌లో స్థానిక సమరం?

- Advertisement -
- Advertisement -

హైకోర్టును గడువు కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలు మ రింత ఆలస్యం కానున్నాయి. నవంబర్ నెలాఖరులో జరిగే అవకాశం ఉందని తెలిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్‌ల ప్రక్రియ అమలు ఆలస్యం కానుండడంతో త మకు మరింత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం అభ్యర్థించనున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లను అమలు చేయాలని భావించిన రాష్ట్ర ప్ర భుత్వం అసెంబ్లీలో బిసి బిల్లును ఆమోదించుకొని రాష్ట్రపతికి పంపించగా ప్రస్తుతం ఢిల్లీలో ఆ బిల్లు పెండింగ్‌లో ఉంది. దీ నిపై పలుమార్లు ఢిల్లీకి సిఎం, మంత్రులు, ఎంపిలు వెళ్లి విన్నవించినా, ధర్నా చేసినా ఇప్పటివరకు దానిపై అతీగతి లేదు. దీంతో కోర్టు ఇచ్చిన సమయం ఈ నెలాఖరు వరకు ఉండడంతో రెండు రోజుల క్రి తం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను రా్రష్ట్ర ప్రభు త్వం నిర్వహించి, గత ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్‌లు మించకుండా తెచ్చిన చట్టాలకు సవరణ చేసింది. అందులో పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 285(ఏ), మున్సిపల్ చట్టం 2019 లోని సెక్షన్ 29కు సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటిని ఆ మోదించుకుంది. ప్రస్తుతం అసెంబ్లీ ఆమోదించిన ఈ రెండు బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపించింది. అయితే, ఈ బిల్లులు కూడా ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

గవర్నర్ న్యాయ సలహా కోసం ఈ బిల్లులను పంపించినట్టుగా తెలిసింది. దీంతో ఈ బిల్లుల ఆమోదానికి మరింత ఆ లస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ రెండు రోజుల క్రితం సవరణలు చేసిన రెం డు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపినా పంచాయతీరాజ్ శా ఖ, మున్సిపల్ శాఖలు అతి తక్కువ సమయంలో బిసిలకు రిజర్వేషన్ కల్పించడం ఇబ్బందిగా మారుతుందని, అందులో భాగంగానే తమకు మరింత సమయం కావాలని ప్రభుత్వం కోర్టును అభ్యర్థించే అవకాశం ఉన్నట్టుగా తెలిసిం ది. దీంతోపాటు త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని అనంతరం స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించుకోవాలని కూడా ప్రభుత్వం భా విస్తున్నట్టుగా తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలిపిస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో జోష్ పెరుగుతుందని అది స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది.

ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కోర్టును అభ్యర్థించడంతో పాటు ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. స్థానిక సం స్థల ఎన్నికల ఆలస్యానికి కారణాలను ఈ లేఖలో ప్రభుత్వం పేర్కొనే అవకాశం ఉన్నట్టుగా సమాచా రం.కోర్టు ఇచ్చే అనుమతిపై ప్రభుత్వం ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News