- Advertisement -
ఆదిలాబాద్: ఢిల్లీ మద్యం కేసులో తాను నిర్ధోషి అని కోర్టు ఏనాడో చెప్పిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) అన్నారు. మంచిర్యాలతో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో కవిత పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలను సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బిజెపితో బిఆర్ఎస్ను (BRS) కలపడమంటే.. లిక్కర్ కేసులో నేరాన్ని అంగీకరించినట్లే అని వ్యాఖ్యానించారు. భాజాపాతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు భవిష్యత్తు లేదన్నారు. జైలులో ఉన్నప్పుడే ఆ పార్టీతో కలవాటనే ప్రతిపాదనను వ్యతిరేకించానని తెలిపారు. కెసిఆర్కు తాను రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారని ప్రశ్నించారు. తనకు కొత్త పార్టీ పెట్టే యోచన లేదని.. బిఆర్ఎస్ను కాపాడుకోవడమే తన లక్ష్యమని అన్నారు. పార్టీ నుంచి తనను బహిష్కరిస్తారని అనుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.
- Advertisement -