ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్బిఐ) రుణ గ్రహీతలకు తీసికబురు చెప్పింది. ఆర్బిఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో హోమ్లోన్స్పై వడ్డీ రేట్లను తగ్గించింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్( ఇబిఎల్ఆర్)లో50 బేసిస్ పాయింట్ల కోత పెట్టింది. సవరించిన వడ్డీ రేట్లు జూన్ 15నుంచి అమలులోకి రానున్నాయి.ఆర్బిఐ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు వడ్డీరేట్ల ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ తాజాగా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను ఎస్బిఐ సవరించింది.
ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేటును (ఇబిఆర్)8.65 శాతంనుంచి 8.15 శాతానికి తగ్గించింది. హోమ్లోన్, ఎంఎస్ఎంఇ, రిజర్వ్ బ్యాంక్ సూచించిన కొన్ని రుణాలకు ఇబిఎల్ఆర్ వర్తిస్తుంది. రుణ గ్రహీత సిబిల్ స్కోర్ ఆధారంగా 7.508.45 మధ్య హోమ్ లోన్స్ లభిస్తాయి. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటుగా కొత్తగా తీసుకునే వారికీ ఈ ప్రయోజనం చేకూరనుంది. హోమ్లోన్ వడ్డీరేట్లతో పాటుగా స్పెషల్ ఎఫ్డి స్కీమ్‘ అమృత్ వృష్టి’ వడ్డీ రేట్లనూ ఎస్బిఐ సవరించింది.ఈ స్కీమ్లో ఇదివరకు ఇస్తున్న వడ్డీరేటులో 25 బేసిస్ పాయింట్లు కోతపెట్టింది. ఇకపై 444 రోజుల కాలవ్యవధి కలిగిన ఈ పథకంలో సాధారణ పౌరులకు 6.60 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటజన్లకు 7.10 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ లభిస్తుంది.