Sunday, June 8, 2025

సిఎం రేవంత్‌ తో ముగిసిన మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేల భేటీ

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. రేపు మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే కెబినేట్ విస్తరణకు కాంగ్రెస్ అదిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురు లేదా నలుగురికి కెబినేట్ లో అవకాశం రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, వేముల వీరేశం, కాలే యాదయ్య.. సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కెబినెట్ లో తమ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరినట్లు తెలుస్తోంది. కెబినెట్ లో ఒకరికి చోటు ఉంటుందని.. అందుబాటులో ఉండాలని సిఎం సూచించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News