హైదరాబాద్: ఈ మధ్యకాలంలో నటీనటులు ఈవెంట్లలో మాట్లాడే.. మాటలు వివాదాలకు దారి తీస్తున్నాయి. అయితే ఎంతటి వారైనా.. ఒకసారి నోరుజారితే వెనక్కి తీసుకోలేరని అందరికీ తెలిసిందే. కానీ, కొందరు సెలబ్రిటీలు మాత్రం అత్యుత్సాహంతో కొందర మనోభవాలను దెబ్బ తీసేలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడి చిక్కుల్లో పడ్డాడు హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) . సూర్య హీరోగా నటించిను ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే, ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయి అని వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు ఆరోపణ చేశాయి. దీనిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. శనివారం రాయదుర్గం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రాయదుర్గం పోలీసులు విజయ్పై (Vijay Deverakonda) ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు.