Thursday, June 19, 2025

బడికి పోయిన చిన్న పిల్లలతో మూత్ర శాలలు శుభ్రం చేయించిన టీచర్లు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని నేరెళ్లచెరువు గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల లో చిన్న పిల్లలు, విద్యార్థులతో మూత్ర శాలలను  టీచర్లు శుభ్రం చేయించారు. ఈ సంఘటనని గ్రామస్థులు చూసి వీడియో తీసి అక్కడ ఉన్న పాఠశాల హెడ్ మిసెస్ “భాగ్యారెడ్డి” ని అడుగగా ఏంలేదు అని సమాధానం చెప్పిందని, వీడియో చూపిస్తే అయితే ఎంది ఏంచేస్తావ్ చేసుకో అంటూ వెళ్లిపోయిందని ఆవేధన చెందారు. అంతే కాకుండా ఈమె వచ్చిన దగ్గర నుండి అగ్రకుల అహంకారంతో మా దళిత పిల్లల మీద, మా మీద ఇలాంటి జులుం ప్రదర్శిస్తుంటారు అని గ్రామస్తులు చెప్తున్నారు. చిన్న పిల్లలతో ఈ రకంగా మూత్ర శాలలు శుభ్రం చేయించిన హెడ్ మిసెస్ మరియు టీచర్ల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ గ్రామానికి హైదరాబాద్ నుండి పంతుళ్ళు రావడం , ఒక సమయపాలన లేకపోవడం కోస మెరుపు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News