- Advertisement -
బిజెపి మెదక్ ఎంపి రఘునందన్ రావుకు భద్రత పెంచాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. రెండు రోజుల క్రితం ఎంపి రఘునందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి హాజయరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉండగా పీపుల్స్వార్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టునని ఓ అగంతకుడు ఫోన్ చేసి సోమవారం సాయంత్రం లోగా చంపుతానంటూ బెదిరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రఘునందర్ రావు డిజిపి, మెదక్ జిల్లా ఎస్పి, ఇతర ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీస్ శాఖ ఎంపి రఘునందన్ రావుకు భద్రత అవసరమని నిర్దారణకు వచ్చింది. ఈ క్రమంలో ఎంపి పర్యటనలో ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని ముగ్గురు ఎస్పిలకు ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -