దక్షిణ గాజా నగరం ఖాన్యూనిస్లో సైనికుల సాయుధ వాహనాన్ని పేల్చివేయడంతో ఏడుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. వాహనానికి అమర్చిన పేలుడు పరికరాన్ని మంగళవారం పేల్చివేయడంతో ఈ సంఘటన జరిగిందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి బుధవారం తెలిపారు. గాజాలో ఈ సంఘటన ఇజ్రాయెల్ మిలిటరీకి ప్రాణాంతకమైనది. హమాస్తో యుద్ధం 2023 అక్టోబర్7న ప్రారంభమైన నాటి నుంచి 860 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందగా, వీరిలో 400 మంది గాజాలోనే మృతి చెందారు.
ఖాన్యూనిస్ ఏరియాలో ఒక సైనికుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దక్షిణ గాజా స్ట్రిప్లో ఒక నివాస భవనాన్ని తమకు రక్షణ చేసుకుని పొంచిఉన్న ఇజ్రాయెల్ సైనికులపై మంగళవారం మెరుపుదాడి చేశామని హమాస్ మిలిటరీ విభాగం అల్కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల ద్వారా వెల్లడించింది. యాసిన్ 105 క్షిపణితో కొంతమంది సైనికులను లక్షంగా చేసుకుని దాడి చేశామని, మరో క్షిపణిని దక్షిణ ఖాన్యూనిస్లో ప్రయోగించామని పేర్కొంది. అల్కస్సామ్ పోరాట వర్గాలు మెషిన్గన్లతో భవనంపై దాడి చేశాయని చెప్పింది. గాజాలో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 56,000 దాటిపోవడంతో ఈ దాడి జరిగింది.