- Advertisement -
పాకిస్థాన్లోని ఖైబర్ ఫఖ్తూన్ఖ్వాలో ఆదివారం ఓ పడవ బోల్తా కొట్టడంతో కనీసం ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. స్వాత్ జిల్లాలోని కలాంకు చెందిన షాహి బాగ్ ప్రాంతంలో 10 పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా కొట్టింది. దాంతో ఏడుగురు చనిపోయారు. కాగా స్థానికులు ముగ్గురిని రక్షించారు. ఇప్పటికి నలుగురి మృత దేహాలను వెలికితీశారు, మరి ముగ్గురి మృత దేహాల కోసం గాలిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు మరణించిన విషయాన్ని నేషనల్ అసెంబ్లీ సభ్యుడు డాక్టర్ అమ్జద్ అలీ ధ్రువీకరించారు. అంతేకాక బాధితుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. మిగతా ముగ్గురి మృతదేహాలను కనుగొనేందుకు రెస్కూ ఆపరేషన్ను మరింత వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
- Advertisement -