- Advertisement -
అమరావతి: వైసిపి నేత జగన్ మోహన్ రెడ్డి కారు సైడ్ బోర్డుపై నిలబడి ప్రయాణం చేయడమే తప్పు అని కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు షర్మిల అన్నారు. జగన్ షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే ఘటన జరిగిందని చెప్పారు. నెల్లూరులో జగన్ పై షర్మిల విమర్శలు (Sharmila comments) చేశారు. జగన్ ప్రతి విషయంలోనూ ప్రజలను మోసం చేశారని, అధికారంలో ఉన్నప్పుడు జగన్ జనంలోకి వచ్చిన పరిస్థితి లేదని మండిపడ్డారు. ఇప్పుడేమో జనసమీకరణతో బల ప్రదర్శన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మనుషుల పైకి కార్లు ఎక్కిస్తూ.. మానవత్వం గురించి మాట్లాడుతారా? అని జగన్ కు నిబంధనలు, ఆంక్షలు లేవా? అని ప్రశ్నించారు. 3 వాహనాలకు అనుమతిస్తే 30 వాహనాలతో వెళ్తున్నారని షర్మిల దుయ్యబట్టారు.
- Advertisement -