హాపూర్: ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం గురువారం (మే 29) హాపూర్ కొత్వాలి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన షార్ప్షూటర్ను కాల్చి చంపినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుడిని హత్యతో సహా అనేక తీవ్రమైన కేసుల్లో ప్రమేయం ఉన్న వాంటెడ్ క్రిమినల్ నవీన్ కుమార్గా గుర్తించామని, అతనిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
ఏడీజీపీ (STF) అమితాబ్ యష్ ప్రకారం.. బుధవారం రాత్రి ఎస్టీఎఫ్ నోయిడా యూనిట్, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్తో కూడిన సంయుక్త బృందం హాపూర్ కొత్వాలిలో నేరస్థుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల్లో కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కుమార్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఘజియాబాద్ జిల్లాలోని లోని నివాసి నవీన్ కుమార్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధాలు ఉన్న చురుకైన షార్ప్షూటర్గా పేరు తెచ్చుకున్నాడు.మరో గ్యాంగ్స్టర్ హషీం బాబాతో కలిసి కుమార్ పనిచేశాడు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో కుమార్పై 20 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.