ఇండియాలో బుల్లెట్ బైక్స్ కు ఉన్న క్రేజ్ గురుంచి చెప్పాల్సిన పని లేదు. దీనిని అందరూ డ్రైవ్ చేయడానికి ఇష్టపడుతారు. అయితే బులెట్ బైక్ లవర్స్ కు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ తన అత్యంత ప్రసిద్ధ బైక్ బుల్లెట్ 350 ధరలను పెంచింది. కంపెనీ దాదాపు రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు పెంచింది. అయితే ఇది వివిధ వేరియంట్లను బట్టి ఉంటుందని కంపెనీ పేర్కొంది. కాగా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ధరల పెరుగుదల వెనుక ఎటువంటి కారణాన్ని వెల్లడించలేదు. పెరిగిన ఇన్పుట్ ఖర్చులు, కొత్త పెయింట్ స్కీమ్ల జోడింపు లేదా మార్కెట్ పొజిషనింగ్ కారణంగా ధరలు పెరిగి ఉంటాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 కంపెనీ పురాతనమైన, అత్యంత ప్రజాదరణ పొందిన బైక్. దీని డిజైన్ కొన్ని సంవత్సరాలుగా దాదాపు క్లాసిక్, రెట్రోగా ఉంది. ఈ బైక్ లో 349cc J-సిరీస్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 20.2hp శక్తిని, 27Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్లో 5-స్పీడ్ గేర్బాక్స్ ఉంది.