ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ జట్టు 11 సంవత్సరాల తర్వాత శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలో ఫైనల్స్కి చేరిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్స్లో మాత్రం ఓటమిపాలై.. రన్నర్అప్తో సరిపెట్టుకుంది. అయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని మాత్రం అందరూ అభినందించారు. అయితే ఇది జరిగి పది రోజులు తిరక్కుండానే మరో జట్టును ఫైనల్స్కు చేర్చాడు శ్రేయస్. ముంబై టి-20 లీగ్ 2025లో భాగంగా శ్రేయస్ సారథ్యం వహిస్తున్న సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు మంగళవారం నమో బాంద్రా బ్లాస్టర్స్పై ఘన విజయం సాధించి ఫైనల్స్కు చేరింది.
దీంతో ఏడాది కాలంలో శ్రేయస్ కెప్టెన్గా (Shreyas Iyer) ఉన్న జట్లు ఫైనల్స్కి చేరడం ఇది నాలుగోసారి 2024 ఐపిఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టును ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైని విజేతగా నిలిపాడు. 2025 ఐపిఎల్లో పంజాబ్ జట్టును ఫైనల్స్ చేర్చాడు కానీ, రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు ముంబై టి-20 లీగ్లో ముంబై ఫాల్కన్స్ జట్టులోకి ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ.. ఆ జట్టును ఫైనల్స్కి తీసుకువెళ్లాడు. ఇక ఈ లీగ్లో గురువారం సిద్ధేశ్ లాడ్ నేతృత్వంలోని ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ జట్టుతో ఫైనల్స్లో అమీతుమీ తేల్చుకోనుంది.