న్యూఢిల్లీ: అనేక వాయిదాల తర్వాత భారత వ్యోమగామి శుభాంషు శుక్లా.. మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి రోదసి యాత్రను ప్రారంభించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడానికి బయల్దేరారు. బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. నాసా, ఆక్సియం స్పేస్, స్పేస్ఎక్స్ భాగస్వామ్యంతో యాక్సియం-4లో భాగంగా నలుగురు వ్యోమగాముల రోదసియాత్ర ప్రారంభమైంది. ఈ రాకెట్ ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి ఐఎస్ఎస్కు బయలుదేరింది. రేపు సాయంత్రం 4.30 గంటలకు అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్ వ్యోమనౌక డాకింగ్ ప్రక్రియ ఉంటుందని అంచనా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకునేందుకు 28 గంటల ప్రయాణించి.. 14 రోజుల పాటు ఐఎస్ఎస్లో వ్యోమగాములు గడపనున్నారు. కాగా, యాక్సియం-4 మిషన్కు శుభాంశు శుక్లా పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన రోదసీయాత్ర కోసం భారత్ దాదాపు రూ.550 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభం.. నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్..
- Advertisement -
- Advertisement -
- Advertisement -