న్యూఢిల్లీ: ISRO(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) వ్యోమగామి శుభాంశు శుక్లా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. భారత అంతరిక్ష చరిత్రలో గర్వించదగ్గ మైలురాయిని నమోదు చేశాడు. ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలిచాడు. ఆక్సియమ్ మిషన్ 4 (యాక్స్-4)లో భాగంగా శుభాన్షు శుక్లాతోపాటు మాజీ NASA వ్యోమగామి పెగ్గీ విట్సన్, పోలాండ్కు చెందిన ESA (యూరోపియన్ అంతరిక్ష సంస్థ) వ్యోమగామి స్వావోస్జ్ ఉజ్నాన్స్కి-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు గురువారం సాయంత్రం ఐఎస్ఎస్ లో ప్రవేశించారు. వీరు ప్రయాణించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఇవాళ సాయంత్రం 4.03 గంటలకు ISSతో విజయవంతంగా డాక్ చేసింది. నిన్న తెల్లవారుజామున 2.31 గంటలకు ఫ్లోరిడాలోని NASAకు సంబంధించిన కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ వీరిని మోసుకెళ్లిన సంగతి తెలిసిందే. అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం తర్వాత ఈరోజు సాయంత్రం శుభాంశు బృందం ఐఎస్ఎస్ లోకి సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టింది.
ఐఎస్ఎస్ లో అడుగుపెట్టిన శుభాంశు.. తొలి భారతీయుడిగా రికార్డు
- Advertisement -
- Advertisement -
- Advertisement -