లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియాపై ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్తోనే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శుభ్మాన్ గిల్కు (Shubman Gill) తొలి మ్యాచ్ పరాజయం తీవ్ర నిరాశను మిగిల్చింది. అయితే ఈ క్రమంలో ఓ కోరుకోని చెత్త రికార్డును శుభ్మాన్ గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో గిల్ సెంచరీ చేశాడు. కానీ, ఆఖర్లో జట్టు ఓటమిని చవిచూసింది. ఇలా కెప్టెన్సీ చేపట్టిన మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసి, ఆ తర్వాత జట్టు ఓటమి చూసిన మూడో భారత కెప్టెన్గా గిల్ నిలిచాడు.
గతంలో ఈ రికార్డు దిలీపర్ వెంగ్సర్కార్, విరాట్ కోహ్లీలకు దక్కింది. 1987లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో భారత్ తలపడింది. ఈ మ్యాచ్తోనే కెప్టెన్సీ చేపట్టిన వెంగ్సర్కార్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేశారు. కానీ, ఆ మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక 2014లో ఆస్ట్రేలియా అడిలైడ్ ఓవెల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కెప్టెన్సీ చేపట్టిన విరాట్ కోహ్లీ.. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్లోనూ సెంచరీ చేశాడు. కానీ, దురదృష్టవశాత్తు భారత్ 48 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ను చేజార్చుకుంది. ఇప్పుడు గిల్ (Shubman Gill) కూడా సెంచరీ చేసి మ్యాచ్ ఓడిపోవడంతో అతను వెంగ్సర్కార్, కోహ్లీల సరసన చేరాడు.