హైదరాబాద్: రెండో టెస్టులో టీమిండియా గెలిచి సిరీస్ను సమం చేసింది. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ డబుల సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. కెప్టెన్ అయిన తరువాత మీడియాతో ఎక్కువగా మాట్లాడాల్సి ఉంటుంది. గిల్ మీడియాతో వ్యవహరిస్తున్న తీరు ఎంతో ఆకట్టుకుటుంది. 25 ఏళ్ల కుర్రాడు ఎంతో పరిణతి చెందిన వ్యక్తిగా మాట్లాడుతుండడంతో గిల్ను భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించారు.
టీమిండియా విదేశాలకు వెళ్లినప్పుడు కెప్టెన్ను మీడియా టార్గెట్ చేస్తుందని అశ్విన్ తెలిపారు. పర్యటక జట్టును ఇబ్బందుల్లో పడేస్తే ఆటోమేటిక్గా ఆధిపత్యం సాధించవచ్చని లోకల్ మీడియా ఆలోచన చేస్తుందని చెప్పారు. గిల్ మాత్రం మీడియా విషయంలో సహజ సిద్ధంగానే వ్యవహరించాడని కొనియాడరు. ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా షో చేస్తున్నట్లు కనిపించలేదని మెచ్చుకున్నారు. పాతికేళ్లకే ఎలాంటి ప్రశ్నలకైనా ఇబ్బందిలేకుండా తెలికగా జవాబు చెబుతుండడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ప్లేయర్లకు మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో ముందే చెబుతున్నారని, గిల్ మాత్ర సహజంగానే నైపుణ్యాలను అందిపుచ్చుకున్నాడని ప్రశంసించారు.