సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బైపాస్లోని దుర్గాపురం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎస్సైతో సహా కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపిలోని కొనసీమ జిల్లా ఆలమూరు మండలం ఎస్సై అశోక్ తన నలుగురు సిబ్బందితో కలిసి ఓ కేసు విషయమై అర్థరాత్రి హైదరాబాద్కు బయలుదేరారు. ఈ క్రమంలో కోదాడ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని డికొట్టింది. దీంతో కారు నుజు నుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ స్వామి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలు కావడంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సీపీఆర్ చేసినప్పటికి ఫలితం లేకుండాపోయింది.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఎస్ఐ, కానిస్టేబుల్ మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -