- Advertisement -
కోదాడ: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ, కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా ఆలమూరు స్టేషన్లో ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ వీరస్వామి విధులు నిర్వహిస్తున్నారు. పని నిమిత్తం ఇద్దరు హైదరాబాద్కు వస్తున్నారు. కోదాడ శివారులో జాతీయ రహదారిపై వీరి కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఎస్ఐ, కానిస్టేబుల్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో కారును పక్కకు తొలగించారు.
- Advertisement -