పోలీస్ స్టేషన్ పైకప్పు కూప్పకూలడంతో ఎస్ఐ మృతి చెందిన విషాద సంఘటన ఘజియాబాద్లో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు ఘజియాబాద్లోని అంకుర్ విహార్ ప్రాంతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) కార్యాలయం పైకప్పు కూలిపోవడంతో 58 ఏళ్ల సబ్-ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
మృతి చెందిన ఎస్ఐని వీరేంద్ర మిశ్రాగా గుర్తించారు. ఇటీవల అంకుర్ విహార్లోని కార్యాలయంలో ACPకి వ్యక్తిగత సహాయకుడిగా వీరేంద్ర నియమితులయ్యారు.రాత్రి విధుల్లో ఉన్న ఆయన స్టేషన్ లోని ఓ గదిలో నిద్రిస్తున్న సమయంలో స్లాప్ కూలిపోవడంతో తీవ్రంగా గాయపడి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఉదయం పోలీసు సిబ్బంది కార్యాలయానికి వచ్చి చూడగా… శిథిలాల కింద చిక్కుకున్న సబ్-ఇన్స్పెక్టర్ మిశ్రాను గుర్తించి, ఆయనను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఎటావా జిల్లాలోని ఆయన కుటుంబానికి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.