Friday, June 6, 2025

గొప్ప మనస్సు చాటుకున్న సిద్ధూ.. సినిమా ప్లాఫ్ అయిందని..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిజె టిల్లు సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు సిద్దూ జొ్న్నలగడ్డ (Siddhu Jonnalagadda). అయితే తాజాగా విడులైన ‘జాక్’ అనే సినిమా తీవ్ర నిరాశ పరిచింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకతంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేసింది. ఈ సినిమాను రూ.36 కోట్లు పెట్టి నిర్మించగా.. కేవలం రూ.7 కోట్ల మాత్రమే రాబట్టిన్టు తెలుస్తోంది. అయితే నిర్మాతలు తీవ్ర నష్టపోవడాన్ని చూసి సిద్ధు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ఈ సినిమాకు రూ.9.5 కోట్లు పారితోషికం తీసుకున్న సిద్ధూ (Siddhu Jonnalagadda) అందులో రూ.4.75 కోట్లు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‌కి వెనక్కి ఇచ్చేశాడని టాక్ వినిపిస్తోంది. దీంతో సిద్ధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టిల్లు మనస్సు బంగారం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధు ‘తెలుసు కదా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో నీరజా కోనా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టిలు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News