- Advertisement -
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్కప్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మరో పతకాన్ని సాధించింది. గురువారం జరిగిన మ హిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో సిఫ్ట్ కౌ ర్ సమ్రా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్కు చెందిన ఎలవేనిల్ వలరివన్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా సిఫ్ట్ కౌర్ కూడా అసాధారణ ఆటతో పతకాన్ని సొంతం చేసుకుంది. ఫరీద్కోట్కు చెందిన 23 ఏళ్ల సిఫ్ట్ 453.1 స్కోర్తో మూ డో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది.
- Advertisement -