Monday, June 2, 2025

భారత్ ఉగ్రవాదాన్ని సహించదు: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

భోపాల్: సాంప్రదాయకంగా వైవాహిక నిబద్ధతకు చిహ్నంగా ఉన్న సిందూర్ నేడు నారీ శక్తి (మహిళా శక్తి), జాతీయ శౌర్యానికి చిహ్నంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం భోపాల్‌లో ప్రముఖ రాణి, సంఘ సంస్కర్త దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా జరిగిన మహిళా సశక్తికరణ్ మహా సమ్మేళనంలో మోడీ మాట్లాడుతూ.. అహల్యాబాయి చెప్పినట్లుగా నాయకుడు ప్రజల జీవితాల్లో సంస్కరణలను తీసుకురావాలని ప్రధాని మోడీ అన్నారు. దేవుడిని ఆరాధించడం, ప్రజలను సేవించడం మధ్య దేవి అహల్యాబాయి ఎప్పుడూ తేడా చూపించలేదని చెప్పారు. పేదలకు సహాయం చేయడానికి, వారు జీవితంలో పురోగతి సాధించడానికి అహల్యాబాయి కృషి చేశారని ప్రధాని కొనియాడారు.

అలాగే, ఆపరేషన్ సిందూరు గురించి మాట్లాడుతూ.. భారత్ ఇప్పటివరకు చేపట్టిన అతిపెద్ద సరిహద్దు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ అని అన్నారు.ఈ ఆపరేషన్.. దేశం ఉగ్రవాదాన్ని సహించదని స్పష్టమైన సందేశాన్ని పంపిందని ప్రధాని చెప్పారు. పాకిస్తాన్ దాడి చేస్తే, ప్రతిస్పందన బుల్లెట్లతో ఉంటుందని ఆయన అన్నారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను కాపాడుకోవడంలో అచంచలమైన నిబద్ధతను ఈ ఆపరేషన్ ప్రదర్శించిందని మోడీ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News