Sunday, July 27, 2025

భారతి సిమెంట్స్ కార్యాలయంలో సిట్ సోదాలు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని భారతి సిమెంట్స్ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, బాలాజి, గోవిందప్ప, చాణక్యలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాలాజి, గోవిందప్ప డైరెక్టర్లుగా పనిచేసిన భారతి సిమెంట్స్ కార్యాలయం, చాణక్యకు చెందిన గ్రిల్ రెస్టారెంట్ లో సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని భారతి సిమెంట్స్ కార్యాలయం కేంద్రంగా ఏపి మద్యం కుంభకోణం నడిచినట్లు సిట్ అనుమానించింది. హైదరాబాద్‌లోని 6 డెన్‌లకు భారతి సిమెంట్స్ కార్యాలయం నుంచి ముడుపులు తరలించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సుమారు రూ. 3500 కోట్ల లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన పలు సమావేశాలు, లిక్కర్ సరఫరా కంపెనీలతో, డిస్టిలరీ యజమానులతో సమావేశాలు భారతి సమెంట్స్ కార్యాలయంలోనే జరిగినట్టు సిట్ అధికారులు గుర్తించారు. కాగా ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యూమెంట్లు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News