Monday, May 19, 2025

‘కరాలి’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మందలపు ప్రవల్లిక సమర్పణలో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ చంద్ర, రాశీ సింగ్, కాజల్ చౌదరీ హీరో హీరోయిన్లుగా మందలపు శివకృష్ణ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘కరాలి’. (Karali)ఈ మూవీకి రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్‌కు సాహు గారపాటి స్క్రిప్టును అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టగా, శ్రీహర్షిణి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత గోరంట్ల రవికుమార్, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ తుమాటి నరసింహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్సటైల్ స్టార్ నవీన్ చంద్ర మాట్లాడుతూ.. “కరాలి’ అనే టైటిల్ ఎంత కొత్తగా, డిఫరెంట్‌గా ఉందో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది.

ఇంత వరకు నేను చేయని ఓ డిఫరెంట్ యాక్షన్ డ్రామా ఇది’ అని అన్నారు. చిత్ర నిర్మాత మందలపు శివకృష్ణ మాట్లాడుతూ.. ‘నేను కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగిని. అక్కడ వీఆర్‌ఎస్ తీసుకుని సినిమాల మీద ప్యాషన్‌తో ఇంత వరకు కూడబెట్టుకున్న డబ్బులతో ఇక్కడకు వచ్చాను. నాకున్న ప్యాషన్‌తోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఆ టైంలోనే రాకేష్ పొట్ట కథను చెప్పారు. నాకు ఆ కథ చాలా నచ్చింది. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం. ఈ కొత్త యాక్షన్ మూవీని అందరి ముందుకు తీసుకు వస్తాం. నాకు ఇది ఫస్ట్ మూవీ అయినా సరే నా మీద నమ్మకంతో ముందుకు వచ్చిన నవీన్ చంద్రకి థాంక్స్’ అని తెలిపారు. చిత్ర దర్శకుడు రాకేష్ పొట్టా మాట్లాడుతూ.. ‘నవీన్ చంద్రతో పనిచేయడం ఆనందంగా ఉంది. నన్ము నమ్మి అవకాశం ఇచ్చిన ఆయనకు థాంక్స్. నేను చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో నిర్మించేందుకు వచ్చిన శివకి థాంక్స్’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కాజల్ చౌదరి, కెమెరామెన్ అపూర్వ అనిల్ శాలిగ్రామ్. తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News