Saturday, June 14, 2025

పిడుగులు పడి ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో వేర్వేరు ఘటనలో పిడుగు పడి ఆరుగురు మహిళలు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ బేల మండలంలో గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ఆరుగురు మృతి చెందారు. గాదిగూడ మండలం పిప్రిల్ సౌరే గ్రామానికి చెం దిన శీడంరామ్ భాయి, పెందుర్తి మాధవరావు, పెందు రు సంజన, మంగు భీమ్ బాయ్ నలుగురు మృతి చెందగా వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. అదేవిధంగా బేల మండలం సంగడి గ్రామం లో పంట చేను లో విత్తనాలు నాటుతుండగా పిడుగు పడి గేడం నందిని (45), ఫోన్ కాస్ట్ గ్రామంలో పంట చేనులో కోవా సునీత (38) మృతి చెందారు. ఒకే రోజు ఆరుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. మృతులంతా గిరిజనులే. స్థానికులు పిడుగు పడి మృతి చెందిన విషయాన్ని అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News