- Advertisement -
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. వరంగల్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆరుగురుకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్రమైన దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వరంగల్ ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నెటిజన్లు కోరుతున్నారు. వరంగల్ను కంటైన్మెంట్ జోన్ ప్రకటిస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
- Advertisement -