Monday, June 9, 2025

గోదావరిలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం, అంబటిపల్లి గ్రామ పరిధిలోని మేడిగడ్డ ్రప్రాజెక్టులో శనివారం సాయంత్రం స్నానానికి వెళ్లి గల్లంతైన ఆరుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదివారం పోలీసులు, అధికారులు ఆధ్వర్యంలో రెస్కూ టీం, గజ ఈతగాళ్లతో గోదావరి నీటిలో గాలించి మృతదేహాలను వెలికితీశారు. గోదావరిలో ఆరుగురు యువ కులు మరణించారన్న సమాచారం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు ఎస్‌పి నరేష్, డిఎస్‌పి రాంమ్మోహన్‌రెడ్డి, సిఐ నాగార్జునరావు, ఎస్‌ఐలు పవన్, తామాషారెడ్డి, రమేష్ రెస్కూ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీసి కుటుంబాలకు అప్పగించారు.

మృతులను మహాదేవపూర్ మండలం, అంబటిపల్లి గ్రామానికి చెందిన పట్టి మధుసూదన్, పట్టి శివకుమార్, తోకరి రక్షిత్, కర్నాల సాగర్, మహాముత్తారం మండలం, కొర్లకుంటకు చెందిన రామ్‌చరణ్, స్థంభంపల్లి (పిపి) గ్రామానికి చెందిన రాహుల్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎదిగిన కొడుకులు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న వేలాది మంది యువకుల మృతదేహాలను చూసి చలించిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News