Tuesday, June 17, 2025

స్మార్ట్ సిటీ పేరుతో 70 వేలమందికి కుచ్చుటోపీ

- Advertisement -
- Advertisement -

రూ.2,700 కోట్లు దోచుకున్న ఇద్దరు సోదరులు

జైపూర్:  రాజస్థాన్ కు చెందిన సుభాష్ బిజరాణీ, రణవీర్ బిజరాణి స్మార్ట్ సిటీ పేరు చెప్పి, దాదాపు 70 వేలమందిని, వారి బంధువులను మోసంచేసి, దాదాపు రూ,2,676 కోట్ల రూపాయలు దోచుకున్నారు. రాజస్థాన్ లోని సికార్ జిల్లాకు
చెందిన ఈ ఇద్దరు అన్నదమ్ములు నెక్సా ఎవర్ గ్రీన్ అనే కంపెనీని పెట్టి, గుజరాత్ లోని ధోలేరా స్మార్ట్ సిటీలో ఇళ్ల స్థలాలను కొంటే, పెద్దఎత్తున లాభం వస్తుందని ఆశపెట్టి వేలాది మంది పెట్టుబడిదారులను మోసం చేశారు. ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి అందమైన భవంతుల చిత్రాలు చూపి కలల ప్రపంచంలో విహరింపజేసి మోసం చేశారని పెట్టుబడిదారులు ఆరోపిస్తున్నారు. కోట్లు చెల్లించిన వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

ఆకర్షణీయమైన స్కీమ్ లు పెట్టి చాలా మందికి కమిషన్లు ఆశచూపి, కొత్తవారిని చేర్పించడంలో టార్గెట్లు పెట్టి, పలువురికి ల్యాప్ టాప్ లు, బైక్ లు, కారులు కూడా బహుమతిగా ఆఫర్ చేసి, పెట్టుబడిదారులను విపరీతంగా పెంచుకున్నారు. కొందరికి ప్రత్యేక ఐడీ గుర్తింపు ఇచ్చి, ఎంత ఎక్కువమంది పెట్టుబడిదారులను చేరిస్తే. అంత అదనంగా కమిషన్ వస్తుందని హామీలు ఇచ్చి బుట్టలో వేసుకున్నారు.

ధోలేరా స్మార్ట్ సిటి స్కామ్

రణవీర్ బిజారాణి మొదట 2014లో ధోలేరా లో కొంత భూమిని కొనుగోలు చేశాడు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అయిన సుభాష్ కూడా రిటర్మెంట్ తర్వాత వచ్చిన రూ. 30 లక్షలతో అక్కడే భూమి కొనుగోలు చేశాడు. 2021లో ఇద్దరు
అన్నదమ్ములు నెక్సా ఎవర్ గ్రీన్ కంపెనీని స్థాపించి అహ్మదాబాద్ లో రిజిస్టర్ చేశారు. ఆ కంపెనీ ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగమని ప్రచారం చేసుకున్నారు. తమ వద్ద 1300 భిఘాల భూమి ఉందని, దీనిని ప్రపంచ
స్థాయి స్మార్ట్ సిటీగా మార్చబోతున్నామని పబ్లిసిటీ చేశారు. ఫ్లాట్లు, పాట్లు, పెట్టుబడి స్కీమ్ లతో భారీ లాభాల ఆశచూపి 70 వేల మంది ప్రజలను ఆకట్టుకుని పెట్టుబడులు వసూలు చేశారు.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారి నుంచి ఏకంగా రూ. 2,676కోట్ల రూపాయలు వసూలు చేశారు. కంపెనీ అధికారులుగా సలీంఖాన్, సమీర్, దతార్ సింగ్, ఓంపాల్ వంటి వారిని ఎంచుకున్నారు. రాజస్థాన్ లో వేలాదిమంది ఏజెంట్లను నియమించుకుని వారికి భారీ కమిషన్లు ముట్టచెప్పారు. కేవలం కమిషన్ గానే 1500 కోట్ల రూపాయలు చెల్లించారంటే ఎంత పెద్దఎత్తున మోసం చేశారో తెలుస్తుంది. తర్వాత వారు రాజస్థాన్ లో లగ్జరీ కార్లు, గనులు, హోటళ్లు, అహ్మదాబాద్ లో ఫ్లాట్ లు, గోవాలో 25 రిసార్ట్ లు కొనుగోలు చేశారు. 250 కోట్ల రూపాయలు ఉంచుకుని, మిగతా డబ్బు 27షెల్ కంపెనీలకు బదిలీ చేసి, తర్వాత ఓ రోజు ముహూర్తం చూసుకుని,అన్ని ఆఫీసులు మూసివేసి పరారయ్యారు.
రాజస్థాన్ పోలీసులు జోథ్ పూర్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News