అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్లో భారత స్టార్ క్రికెటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన రెండో ర్యాంక్ను నిలబెట్టుకుంది. మహిళల క్రికెట్లో మంధాన అత్యంత నిలకడైన బ్యాటింగ్ను కనబరుస్తున్న సంగతి తెలిసిందే. భారత్ విజయాల్లో మంధాన తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా తన మార్క్ బ్యాటింగ్తో రాణించడం మంధాన అలవాటుగా మార్చుకోంది. తాజా ర్యాంకింగ్స్లో మంధాన 729 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. కిందటిసారి కూడా మంధాన రెండో ర్యాంక్లోనే నిలిచిన సంగతి తెలిసిందే. ఇక లారా వోల్వార్డ్ (సౌతాఫ్రికా) టాప్ ర్యాంక్లోనే కొనసాగుతోంది. లారా 738 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకుంది. మరోవైపు ఇంగ్లండ్కు చెందిన నటాలి సివర్బ్రంట్ 719 పాయింట్లతో మూడో ర్యాంక్లో నిలిచింది. కిందటి ర్యాంకింగ్స్లో కూడా సివర్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఇంగ్లండ్కే చెందిన వికెట్ కీపర్ అమీ జోన్స్ తాజా ర్యాంకింగ్స్లో నాలుగో స్థానానికి ఎగబాకింది. కిందటి ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో ఉన్న జోన్స్ ప్రస్తుతం టాప్5లో చోటు సంపాదించింది. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో జోన్స్ అద్భుత సెంచరీతో అలరించింది. దీంతో జోన్స్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలిసె పేరీ ఐదో ర్యాంక్ను కాపాడుకుంది. అయితే విండీస్ క్రికెటర్ హేలీ మాథ్యూస్ రెండు ర్యాంక్లు కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయింది. ఇంతకుముందు మాథ్యూస్ నాలుగో ర్యాంక్లో నిలిచింది. ఆస్ట్రేలియా బ్యాటర్ అలీసా హీలీ ఒక ర్యాంక్ను కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయింది. చామరి ఆటపట్టు (శ్రీలంక) 8వ, బేథ్ మూనీ (ఆస్ట్రేలియా) తొమ్మిదో, ఆష్ గార్డ్నర్ (ఆస్ట్రేలియా) పదో ర్యాంక్లో నిలిచారు. భారత క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్ 15వ, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 16వ ర్యాంక్ను దక్కించుకున్నారు.
ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్లో సోఫి ఎకిల్స్టోన్ (ఇంగ్లండ్) టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. 747 పాయింట్లతో ఎకిల్స్టోన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆష్ గార్డ్నర్ (ఆస్ట్రేలియా), మెగాన్ షట్ (ఆస్ట్రేలియా) రెండో, మూడో ర్యాంక్ను కాపాడుకున్నారు. భారత స్టార్ బౌలర్ దీప్తి శర్మ నాలుగో ర్యాంక్ను పదిలం చేసుకుంది. మహిళల వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ రెండో, భారత్ మూడో ర్యాంక్లో నిలిచాయి.