Thursday, June 26, 2025

రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసిన కొడుకు

- Advertisement -
- Advertisement -

రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని, తండ్రి పేరు మీద ఉన్న భూమి తన పేరు మీద చేయించలేదని కన్నకొడుకే తండ్రి నాలుక కోసిన ఘటన మెదక్ జిల్లా, హవేలీ ఘనపూర్ మండలం, ఔరంగాబాద్ తండాలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతుబంధు కింద భానోత్ కిరీయా అనే రైతుకు ఎకరాకు 6,000 చొప్పున అతని ఖాతాలో రూ.9,000 జమ అయ్యాయి. అతని చిన్న కుమారుడు సంతోష్ రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని తండ్రిని కోరగా దానికి అతను ఆసుపత్రిలో 5,000 రూపాయలు వైద్య ఖర్చులకు ఖర్చు అయ్యాయని, మిగతా 4,000 తీసుకోవాలని చెప్పిన వినకుండా ఆగ్రహంతో కొడవలితో తండ్రి నాలుకను కోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కాగా ఆయనను ప్రభుత్వాసుపత్రికి తరలించగా నాలుగు కుట్లు వేశారు. నిందితుడిని హవేలీ ఘనపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News