- Advertisement -
భోపాల్: సోనమ్, ఆమె ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందని ఆమె సోదరుడు గోవింద్ తెలిపారు. తాను సోదరి చంపినట్టు తేలితే ఆమెను ఉరి తీయాలని స్పష్టం చేశారు. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీని(29), ఇటీవలే భారోయ సోనమ్ పెళ్లి చేసుకున్నాడు.తన సోదరి సోనమ్తో తమ కుటుంబం తెగదెంపులు చేసుకుందన్నారు. రాజా రఘువంశీ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన భావ కుటుంబ కోసం న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. హనీమూన్ పేరుతో గౌహతిలోని కామాఖ్య ఆలయంలోకి పూజలు చేసిన తరువాత తాకనిస్తానని భర్తను భార్య అక్కడికి తీసుకెళ్లి అతడిని తన ప్రియుడితో కలిసి చంపేసిన విషయం తెలిసిందే. మరో వైపు సోనమ్తో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురికి ఎనిమిది రోజుల పాటు పోలీస్ కస్టడీ విధిస్తూ కోర్టు అదేశాలు జారీ చేసింది. హనీమూన్ హత్య మూడు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.
- Advertisement -