లండన్: 27 సంవత్సరాల తర్వాత తమ తొలి ICC టైటిల్ను గెలుచుకున్న దక్షిణాఫ్రికా.. భారత్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. టెంబా బావుమా నేతృత్వంలోని సఫారీ జట్టు లార్డ్స్లో సంచలనాత్మక ప్రదర్శన చేసి ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో మట్టికరిపించి.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) మూడవ ఎడిషన్ను గెలుచుకుంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా.. ఐసిసి ఫైనల్లో అతిపెద్ద ఛేజింగ్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. 2011 వన్డే ప్రపంచ కప్లో శ్రీలంకను టీమిండియా ఓడించి కప్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో MS ధోని సారథ్యంలోని భారత జట్టు.. శ్రీలంక విధించిన 275 పరుగులను ఛేదించింది. దీంతో ICC ఫైనల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా భారత్ నిలిచింది. 14 సంవత్సరాలుగా ఈ రికార్డు టీమిండియా పేరిట ఉంది. ఇప్పుడు ఆ రికార్డును సఫారీ జట్టు బ్రేక్ చేసింది. డబ్ల్యూటిసి 2025 ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 282 పరుగుల టార్గెట్ ను ఛేదించి సౌతాఫ్రికా సరికొత్త సరికొత్త రికార్డును నెలకొల్పింది.
కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. డబ్ల్యూటిసి ఫైనల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాలో తొలి ఇన్నింగ్స్లో 212 పరుగుల చేసి ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో 207 పరుగులు చేసింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో మార్క్రమ్ 136, కెప్టెన్ బావుమా 66 పరుగులతో రాణించడంతో 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా నిలిచింది. అద్భుత సెంచరీతో రాణించిన మార్క్రమ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.