Wednesday, June 4, 2025

శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శాసనసభ, మండలిలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహించారు. సోమవారం శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక శాసనమండలి ఆవరణలో ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విజయశాంతి, కోదండరాం తదితరులు పాల్గొన్నారు.

కాగా, మరికాసేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News