Wednesday, September 17, 2025

హైదరాబాద్ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్:  శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నుంచి భద్రాచలానికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపనుంది. ఎంజీబీఎస్, ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి 70 స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసి తెలిపింది. భద్రాచలంలోని శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనాలనుకునే భక్తుల కోసం రెగ్యులర్ సర్వీసులతో పాటు 70 బస్సులు అదనంగా నడపనున్నట్టు ఆర్టీసి తెలిపింది. ఈ రిజర్వేషన్ కౌంటర్ల నుంచి బస్సు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని, రద్దీని బట్టి బస్సుల సంఖ్య మరింత పెంచే అవకాశం ఉందని ఆర్టీసి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News