కేంద్ర హోంశాఖ కార్యదర్శి
నేతృత్వంలో ఏర్పాటు ఎయిర్
ఇండియా విమాన ప్రమాదానికి
దారితీసిన కారణాలను వెలికి
తీయనున్న కమిటీ భవిష్యత్తులో
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా
నివారణా చర్యలను సూచించనున్న
కమిటీ మూడు నెలల్లో నివేదిక
270-కి చేరిన మృతుల సంఖ్య
డిఎన్ఎ పరీక్షల అనంతరం
11మంది మృతుల గుర్తింపు
కొనసాగుతున్న డ్రీమ్ లైనర్ పరీక్షలు’
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన దుర్ఘటనను కేంద్ర పౌర విమానయానశాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నా యుడు తెలిపారు. విమానయాన భద్రతపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో స మీక్ష నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనాస్థలిలో సహాయ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సం యుక్తంగా స్పందించినట్టు పేర్కొన్నారు. “ సంఘటన జరిగిన వెంటనే మంటలార్పి.. మృతదేహాలను అక్కడి నుంచి తరలిం చాం. దుర్ఘటనపై విచారణకు తక్షణమే ఐ దుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చే శాం. అవసరమైతే మరికొంత మంది సభ్యులనూ బృందంలో చేరుస్తాం. శుక్రవారం సాయంత్రం ఘటనాస్థలిలో బ్లాక్బాక్స్ దొరికింది.
దానిని విశ్లేషించిన తరువాత ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తుంది. అందులో ఏముందో తెలుసుకునేందుకు మేమూ ఆతృతగా ఎదురు చూస్తున్నాం. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాల బాధను అర్థం చేసుకోగలను. నా తండ్రి కూడా ప్రమాదం లోనే మరణించారు. ఆ బాధ నాక్కూడా తెలుసు. హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. ప్రత్యేక అధికారులతో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశాం. సంపూర్ణ దర్యాప్తు జరిపేందుకు ఈ కమిటీ సభ్యులు దోహదపడతారు. నిపుణుల విచారణ పూర్తయ్యాక తగిన సమయంలో మీడియాకు సమాచారమిస్తాం. రెండు నెలల్లోగావిచారణ పూర్తవుతుందని భావిస్తున్నాం. అంతే కాకుండా బోయింగ్787 సిరీస్ను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశించాం ” అని రామ్మోహన్ నాయుడు మీడియాకు తెలిపారు.