Thursday, June 5, 2025

ఐపిఎల్ ముగింపు వేడుకల విశేషాలు ఇవే..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ (IPL Final) 18వ సీజన్ తుది దశకు చేరుకుంది. మరికాసేపట్లో సీజన్ ఫైనల్ మ్యాచ్ జరుగునుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఈ ఫైనల్‌లో కప్ కోసం పోటీ పడుతున్నాయి. ఆర్‌సిబి ఇప్పటికే 2009, 2011, 2016లో ఐపిఎల్ ఫైనల్స్‌కి చేరింది. కానీ, రన్నర్‌ ఆప్‌గా నిలిచింది. మరోవైపు పంజాబ్ 2014లో ఒకసారి మాత్రమే ఫైనల్స్‌ చేరి ఓటమిపాలైంది. దీంతో ఈసారి గెలిచిన జట్టు తొలిసారిగా ట్రోఫీని అందుకొని చరిత్ర సృష్టించనుంది.

అయితే ఐపిఎల్ ముగింపు వేడుకలను (IPL Final) బిసిసిఐ గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో ప్రధానంగా పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్‌ విజయం సాధించిన నేపథ్యంలో భారత సాయుధ దళాలలకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. అనంతరం ఆపరేషన్ సింధూర్‌లో సేవలందించిన భారత త్రివిధ దళాల ప్రతినిధులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. ఇక ఈ వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్‌, ఆయన కుమారులు శివం, సిద్ధార్థ్ మహదేవన్‌లు తమ గానంతో ప్రేక్షకులను అలరించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News