మన తెలంగాణ/హైదరాబాద్ : మాన్సూ న్ ఎమర్జెన్సీ టీమ్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని సిఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటి కే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పా యింట్స్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పను ల్లో పురోగతిని గురించి ముఖ్యమంత్రి అడి గి తెలుసు కున్నారు. వర్షాకాల సన్నద్ధత పై అధికారులతో సమీక్షించిన ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ హార్వెస్టింగ్ వెల్స్లోకి చేరే వర్షపు నీరు చేరితే వెంటనే ఆటోమేటిక్ పంపులతో ఆ నీటిని బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులతో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
నాలుగు విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి
వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసి విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్ ఆదేశించారు. నాలుగు విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వీలైనంతగా త్వరగా పూర్తి చేయాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సిఎం సూచించారు.
ఔటర్ రింగ్రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని, డీసిల్టింగ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలిం చాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంఓ అధికారులు శేషాద్రి, మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండిఏ అధికారులతో పాటు, ఇతర అధికారులు పాల్గొన్నారు