Friday, May 30, 2025

భారత స్కేటింగ్ టీమ్‌లో శ్రీశాంత్‌కు చోటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ రోల్‌బాల్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత అండర్17 టీమ్‌లో తెలంగాణకు చెందిన శ్రీశాంత్ ఎంపికయ్యాడు. శ్రీశాంత్ (Sreesanth) సిఆర్‌పిఎఫ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కెన్యా వేదికగా జరిగే ప్రపంచ స్కేటింగ్ వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టులో శ్రీశాంత్ స్థానం సంపాదించాడు. శ్రీశాంత్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న శిల్ప వాఘ్రె భారత టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైంది. వీరిని తెలంగాణ రోల్‌బాల్ సంఘం కార్యదర్శి సయ్యద్ ఎహ్‌సాన్ అహ్మద్, కోశాధికారి షఫివుల్లా హుస్సేని, శాట్స్ స్కేటింగ్ కోచ్ జితేంద్ర గుప్తా తదితరులు సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News