కొలంబో: బంగ్లాదేశ్తో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య శ్రీలంక ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో లంక రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0తో సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టులో లంక పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభా గాల్లో ఆల్రౌండ్షోతో అదరగొట్టిన లంక భారీ విజ యంతో సిరీస్ను దక్కించుకుంది.
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో పూర్తిగా నిరాశ పరిచింది. 44.2 ఓవర్లలో కేవలం 133 పరుగులకే కుప్పకూలింది. బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో జట్టుకు ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. సీనియర్ బ్యాటర్ ముష్ఫికుర్ రహీం (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా వారి లో అనముల్ హక్ (19), కెప్టెన్ శాంటో (19) పరు గులు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య ఐదు, ధనంజయ డిసిల్వా, తరిండు రత్నాయకే రెండేసి వికెట్లను పడగొట్టారు. కాగా, బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో 247 పరుగులు చేసింది. శ్రీలంక 458 పరుగులు చేసి భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అద్భుత సెంచరీతో లంక భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ పాథుమ్ నిశాంకకు మ్యాచ్ ఆఫ్ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది.