- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు మండలంలో రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ఎఎస్ పేట గ్రామ శివారులో ఆటోను కారు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు వెంకటరావుపల్లి గ్రామానికి చెందిన కూలీలుగా గుర్తించారు. తెల్లపాడులో పొగాకు గ్రేడింగ్ కోసం కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -