Monday, September 15, 2025

రైలు కిందపడి యువతి యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: రైలు కిందపడి యువతి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యువతి యువకుడు షాలీమార్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి పలాసకు వచ్చారు. ఇద్దరు ట్రాక్‌పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు పశ్చిమబెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్‌కు చెందిన రంజనా రాయ్, తాషి షేర్పాగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News