Tuesday, June 24, 2025

శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం

- Advertisement -
- Advertisement -

కియోస్క్ యంత్రాల ద్వారా లడ్డూల విక్రయం

తిరుమల: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం (Srivari Laddu Prasadam) కోనుగోలుకు టిటిడి నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కోనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచింది. ఈ సదుపాయం ద్వారా భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించి త్వరితగతిన లడ్డూల కొనుగోలు ప్రక్రియ చేసేలా అవకాశం కల్పించడం జరిగింది. యుపిఐ చెల్లింపు సదుపాయం ద్వారా నగదు లేకుండా పారదర్శక లావాదేవీలు జరిగేలా టిటిడి ఏర్పాటుచేసింది.

కియోస్క్ ద్వారా లడ్డూలు పొందే విధానం –

భక్తులు లడ్డూ (Srivari Laddu Prasadam) పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం వద్దకు వెళ్తారు.

యంత్రంలో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి:

1.దర్శన టికెట్ ఉన్నవారు

2.దర్శన టికెట్ లేనివారు

దర్శన టికెట్ ఉన్నవారు:

ఈ ఆప్షన్ ఎంచుకోండి.

టికెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది.

టికెట్‌లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి రెండు అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.

దర్శన టికెట్ లేనివారు:

ఈ ఆప్షన్ ఎంచుకుని సరైన ఆధార్ నంబర్ ఇవ్వాలి.

ఈ మార్గం ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.

సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు.

చెల్లింపు అనంతరం ముద్రిత రసీదు అందుతుంది.

ఆ రసీదుతో లడ్డూ కౌంటర్ల (Srivari Laddu Prasadam) వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు.

భక్తుల సౌకర్యార్థం టిటిడి ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి నుండి విశేష స్పందన లభిస్తోంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.  సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు ఆదివారం 84,179 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 33,036 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.72 కోట్లు ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News