- Advertisement -
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు అభిమానులు మృతి చెందినట్లు తెలుస్తోంది. 18ఏళ్ల తర్వాత తొలిసారి ఐపిఎల్ కప్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. కర్ణాటకలోని విధాన సభ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ నిర్వహించింది. ఈ పరేడ్ కు భారీగా అభిమానులు తరలివచ్చారు. దీంతో పోలీసులు క్రౌడ్ ను కంట్రోల్ చేసేందుకు కష్టంగా మారింది. ఈక్రమంలో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ఫ్యాన్స్ మరణించగా.. దాదాపు 25 మందికి పైగా గాయాపడినట్లు సమాచారం. స్టేడియం వద్ద పరిస్థితి అదుపుతప్పినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
- Advertisement -