Thursday, September 18, 2025

విద్యార్థిని బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్ఫుగొండకు చెందిన విద్యార్థిని కావ్య (17)ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సదాశివనగర్ మండలం మర్కల్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో కావ్య డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన కావ్య, సెలవులు ముగియడంతో కళాశాలకు వెళ్లాలని తల్లిదండ్రులు సూచించారు.

తనకు చదువు అర్థం కావడం లేదని కళాశాలకు వెళ్లనని మారాం చేయడంతో తల్లిదండ్రులు చేనులో పని నిమిత్తం వెళ్ళారు. అనంతరం కావ్య ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News