Wednesday, June 18, 2025

విమాన ప్రమాద ఘటన.. ప్రాణాలు కాపాడుకొనేందుకు బాల్కనీ నుంచి దూకేశారు..

- Advertisement -
- Advertisement -

జూన్ 12వ తేదీన అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఒక వ్యక్తి మినహా ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే విమానం బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకొనేందుకు కొందరు విద్యార్థులు బాల్కనీల నుంచి బయటకు దూకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

బిజె మెడికల్ కాలేజీ భవనాన్ని విమానం ఢీకొన్న వెంటనే భారీగా శబ్ధం వచ్చింది. దీంతో భయపడిపోయిన విద్యార్థులు మూడో అంతస్థు బాల్కనీకి బెడ్‌షీట్లను కట్టి.. తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు కిందకు దూకేశారు. అక్కడ ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను వీడియో తీశారు. ఒకవైపు ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్ధేశ్యంతో.. ప్రాణాలకు తెగించి విద్యార్థులు ఈ సాహసం చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News