Wednesday, April 30, 2025

ఓటరు నమోదును విజయవంతంగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేస్తూ ఈ నెల 20వ తేదీలోగా విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ కోరారు. శుక్రవారం రామగుండం ఎన్టీపీసీ ఈడిసి ఆడిటోరియంలో రామగుండం నియోజక వర్గం బిఎల్‌ఓలు సూపర్ వైజర్లతో నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమం సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

రామగుండం పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ కొత్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా ఓటర్లలో బదిలీ అయిన వారిని తొలగించి, వారి స్థానంలో కొత్తగా వచ్చిన వారిని ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. యువ ఓటర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మినారాయణ, రామగుండం తహశీల్దార్ జావిద్ పాషా, కిరణ్‌తోపాటు బిఎల్‌ఓలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News